telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

లోకేష్‌పై విజయసాయిరెడ్డి సెటైర్‌..బాబునే మించిపోయాడు అంటూ

vijayasaireddy ycp

ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తూనే ఉంది టీడీపీ. అయితే…టీడీపీకి ధీటుగా వైసీపీ నేతలు కౌంటర్‌ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే మూడు రాజధానులు విషయంపై ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. తాజాగా…వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ నేత లోకేష్‌ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “బాబు నుండి అవినీతి, అసమర్ధత,అసత్యం వారసత్వంగా తీసుకున్న చినబాబు, ఇప్పుడు బాబునే మించిపోయాడు.వయో భారంతో సంభవించే సహజ మరణంను కూడా తన రియల్‌ఎస్టేట్ అడ్డా అమరావతి లిస్టులో వేసే దుష్ట ప్రచారానికి దిగాడు. తండ్రిలానే మాలోకం మతి చెడిపోయింది. ఇంకెంతకాలం అవుట్‌డేటెడ్ బుర్ర వాడుతావు మాలోకం?” అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి. అంతకు ముందు ట్వీట్ లో “ఆ పసిపిల్లల మోముల్లో వెల్లివిరిసిన ఆనందం పచ్చ మీడియాకు కనిపించడం లేదు. జగనన్న విద్యాకానుక కింద కిట్లు పొందిన విద్యార్థులు దసరా, దీపావళి ఒకేసారి వచ్చినట్టు సంబరపడుతున్నారు. వెలుగు దివ్వెల్లా మెరిసిపోతున్న వారి సంతోషాన్ని చూపించడానికి భజన మీడియాకు మనసొప్పడం లేదు.” అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు

Related posts