telugu navyamedia
రాజకీయ వార్తలు

కరోనాపై తిరుగులేని పోరాటం: యోగి ఆదిత్యనాథ్‌

yogi adityanath

కరోనాపై తిరుగులేని పోరాటం సాగిస్తున్నామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. గౌతమ్ బుద్ధనగర్ జిల్లా నోయిడాలోని సెక్టార్ 39లో 400 పడకల కరోనా ఆసుపత్రిని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. గౌతమ్ బుద్ధనగర్ ఎన్‌సీఆర్ ప్రాంతంలో కరోనా తీవ్రంగా ఉందన్నారు. ఢిల్లీలో వైరస్‌ తీవ్రత అధికంగా ఉండడంతో ఇక్కడ వ్యాప్తి ఉద్ధృతమైందని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు లెవల్ -1 ఆస్పత్రులున్నాయని, రానున్న 10 నుంచి 15 రోజుల్లో లెవల్-2 దవాఖానలను స్థాపిస్తామని చెప్పారు. మొట్టమొదటి లెవల్‌-2 దవాఖానను నోయిడాలో ప్రారంభించామని, రెండో దవాఖానను మరో 10 రోజుల్లో గోండాలో ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం దవాఖానలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు.

Related posts