telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రైతుల అరెస్టును ఖండించిన సోము వీర్రాజు

Somu Veerraju BJP

అమరావతి ప్రాంత రైతులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తాము ఖండిస్తున్నానని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రావలసిన కౌలు కోసం సీఆర్‌డీఏ కార్యాలయానికి వచ్చిన రైతులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇంకా ఎవరినైనా విడుదల చేయకపోతే వెంటనే విడుదల చేసి భూములిచ్చిన రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించి సత్వరమే పరిష్కారమార్గాన్ని చూడాలని డిమాండ్ చేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూమి త్యాగం చేసిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో ప్రభుత్వం తీరు గర్హనీయం. 28 వేలమంది పైగా రైతుల త్యాగానికి కరోనా కష్టకాలంలో కౌలు చెల్లించి ఆడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ఇచ్చిన సమయానికి మించి 100 రోజులు గడిచినందున రైతులు రోడ్డెక్కారన్నారు. జూన్ 21వ తేదీన కౌలు రైతులకు చెల్లించాల్సిన సొమ్ము విడుదల చేస్తున్నట్లు రెండు జీవోలను ప్రభుత్వం జారీ చేసినా సాంకేతిక కారణాలు చూపించి ఎవరికీ డబ్బు జమ చేయకపోవడం రైతులను క్షోభకు గురి చేయడమేనని అన్నారు.

Related posts