telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Revanth-Reddy mp

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. టీఆర్టీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వెంటనే పోస్టులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి లేఖలో డిమాండ్ చేశారు. టీఆర్టీ ఫలితాలను వెల్లడించి రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు నియామక ఉత్తర్వులను ఇవ్వలేదని విమర్శించారు. 2017లో టీఆర్టీ భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో నియామక ఉత్తర్వులు తమకు అందలేదనే విషయాన్ని బాధితులు తన దృష్టికి తీసుకొచ్చారని లేఖలో పేర్కొన్నారు.

నియామక ఉత్తర్వులను ఇస్తారో, లేదో అని అభ్యర్థులు మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వానికి యువత పట్ల ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోందని చెప్పారు.స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ పేరుతో నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంటే, తెలంగాణ 14వ స్థానంలో ఉందని రేవంత్ విమర్శించారు.

Related posts