తెలంగాణ మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్య కోర్సుల్లో 2019–20 విద్యా ఏడాదికి ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అగ్ర కులాల్లోని పేదలకు 10% రిజర్వేషన్ అమలు ఉత్తర్వులు విడుదల చేసిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవే టు, మైనారిటీ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. వర్సి టీ వెబ్సైట్ ( www. knru hs.in & http://www. knruh s.telangana.g ov.in) 22 నుంచి 28 వరకు దరఖాస్తు దరఖాస్తు చేసుకోవాలని వీసీ కరుణాకర్రెడ్డి సూచించారు.
దరఖాస్తుల ఆధారంగా 28 రాత్రి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. 29 నుంచి సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. తుది జాబితా విడుదల చేసి సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించనున్నా రు. దరఖాస్తు సమయంలో సమస్యలు తలెత్తితే 9502001583, 8466924522 నంబర్ల లో సంప్రదించాలని, నిబంధనల సమాచారం కోసం 9490585796, 8500646 769 నంబర్లలో సంప్రదించవచ్చు. అఖిల భారత కోటా సీట్లలో చేరేందుకు జూలై 3 చివరి తేదీ కావడంతో ఇక్కడ దరఖాస్తు చేసినవారు ఆ లోపే వెరిఫికేషన్ చేయించు కోవాలని సూచించారు.