ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 2018లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అర్హులైన లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను అందజేశారు. అయితే ఉత్తరప్రదేశ్లోని ఓ నాలుగు ఆస్పత్రుల్లో ఆయుష్మాన్ భారత్ కార్డు చెల్లలేదు. ఈ కార్డు చూపిన వెంటనే వైద్యులు చికిత్సకు నిరాకరించారు. దీంతో 59 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బరేలికి చెందిన మాత్లవ్ హుస్సేన్(59)కు బుధవారం రాత్రి జ్వరం వచ్చింది. ఈ క్రమంలో ఆయనను బుధవారం రాత్రి 9 గంటలకు సివిల్ లైన్స్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆయుష్మాన్ కార్డు చూపించేసరికి డాక్టర్ సెలవులో ఉన్నాడని అక్కడున్న సిబ్బంది చెప్పారు.
చివరకు జంక్షన్ రోడ్డులోని మరో ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయుష్మాన్ కార్డు గురించి చెప్పేసరికి తమ ఆస్పత్రి ఆ పథకంతో ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిపింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 3 గంటల వరకు నాలుగు ఆస్పత్రులు తిరిగిన ఆయుష్మాన్ కార్డు చెల్లదని.. హుస్సేన్కు వైద్యం చేయలేదు. దీంతో హుస్సేన్ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచాడు.
చంద్రబాబే వారిని బీజేపీలోకి పంపారు: తలసాని