బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మొదటి నుండే మమతా బెనర్జీకి మద్దతుగా ఉంటున్నాడు. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు దాదా బీజేపీలో చేరనున్నట్లు.. త్వరలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు సిద్ధమైన బెంగాల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనే ర్యాలీలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పాల్గొంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మార్చి 7న జరిగే ర్యాలీలో మోదీతో కలిసి గంగూలీ కొత్త ఇన్నింగ్స్ మొదలు పెడుతారంటూ వార్తలు జోరందుకున్నాయి. అటు బీజేపీ కూడా దాదా రావాలనుకుంటే రావొచ్చని చెబుతోంది. మోదీ ర్యాలీలో గంగూలీ పాల్గొంటారన్న చర్చపై బీజేపీ నేతలు స్పందించారు. దాదా వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తామని చెబుతున్నారు. గంగూలీ ర్యాలీకి రావాలనుకుంటే.. ఆయన ఆరోగ్యం సహకరిస్తే.. మోస్ట్ వెల్కమ్ అంటున్నారు. గంగూలీ వస్తే.. అది తమలో, ర్యాలీకి వచ్చే కార్యకర్తల్లో జోష్ నింపుతుందని బెంగాల్ బీజేపీ అధికార ప్రతినిధి షణ్ముఖ్ భట్టాచార్య చెప్పారు. చూడాలి మరి ఈ వార్తలు నిజామా.. అబద్దమా అనేది.
previous post
next post
అప్పుడు తండ్రి ఇప్పుడు కొడుకు.. జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు