telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలో JHWS జైత్రయాత్ర…

జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలు నేడు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల పోటీలో వ్యాపారవేత్త టి.హనుమంతరావు, రవీంద్రనాథ్ ప్యానెల్ ఉన్నాయి. అయితే హనుమంతరావు ప్యానెల్ ఎన్నికల్లో ఓడిపోయింది. ఈ ఎన్నికలో మహిళల కేటగిరిలో మొత్తం 4 సభ్యులు బరిలో నిలవగా JHWS ప్యానెల్ సభ్యులు హిమబిందు రెడ్డి, సునీల రెడ్డి వైపే ఓటర్లు మొగ్గు చూపారు. అయితే ఈ ఎన్నికలో పాలకమండలిలోని 15 పోస్టులకు ఎన్నికలు జరగగా అందులో JHWS తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఇంతకముందు ఎస్సీ, ఎస్టీ కేటగిరిలో JHWS ప్యానెల్ అభ్యర్థి సుజాత ఘానా విజయం సాధించారు. ఈ కేటగిరిలో ఇద్దరు సభ్యులు పోటీ చేయగా ఓటర్లు మాత్రం సుజాత వైపే మొగ్గు చూపారు. ఇక మిగిలిన స్థానాల్లో కూడా JHWS ప్యానెల్ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. అయితే గత 15 ఏళ్లగా ఇక్కడ ఎన్నికలు జరగని విషయం అందరికి తెలిసిందే.

Related posts