జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా నేపథ్యంలో ఓ పాకిస్థానీ మహిళకు భారత పౌరసత్వం మంజూరైంది. ఆమె అభ్యర్థన మేరకు భారత పౌరసత్వం మంజూరు చేసింది. గుజరాత్ లోని భాన్వాడ్ తాలూకాలో పుట్టి పెరిగిన మహిళ హసీనాబెన్.1999లో పాకిస్థాన్ కు చెందిన పౌరుడిని వివాహం చేసుకుంది.
ఆ తర్వాత ఆమె పాక్ పౌరసత్వం పొందింది. తన భర్త మరణించడంతో ఆమె తిరిగి భారత్ కు రావాలని నిర్ణయించుకుంది.ఈ క్రమంలో రెండేళ్ల క్రితం భారత పౌరసత్వం కోసం మన ప్రభుత్వానికి అభ్యర్థన చేసింది. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న భారత ప్రభుత్వం అందుకు అంగీకరించింది. ఈ నెల 18న ద్వారక జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా భారత పౌరసత్వ ధ్రువపత్రాన్ని ఆమె అందుకున్నారు.