తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించాల్సిన ప్రభుత్వ లెటర్ ప్యాడ్ ను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తూ అడ్డంగా దొరికిపోయారు. తన మంత్రిత్వ శాఖకు చెందిన లెటర్ హెడ్ పై కీసర మండల టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడిగా జలపురం సుధాకర్ రెడ్డిని నియమిస్తూ అపాయింట్ మెంట్ లెటర్ జారీ చేశారు. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి వాడాల్సిన లెటర్ హెడ్ ను పార్టీ వ్యవహారాలకు వినియోగించడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
పార్టీ లెటర్ ప్యాడ్ పై ఇవ్వాల్సిన అపాయింట్ మెంట్ లెటర్ కాస్త ప్రభుత్వ లెటర్ ప్యాడ్ పై ఇచ్చి దొరికిపోయారు. ఏది ఏమైనప్పటికీ రాజకీయాల్లో మల్లారెడ్డి రూటే సెపరేట్ అంటుంటారు . తెలుగుదేశం పార్టీ తరపున మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి అనంతరం నియోజకవర్గం అభివృద్ధిపేరుతో టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. 2018 ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కేసీఆర్ కేబినేట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు. లెటర్ ప్యాడ్ విషయం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది.
లోకేశ్ నేరుగా మాట్లాడలేరు… ట్విట్టర్లో ఏదో ఒకటి చెబుతారు: బొత్స