telugu navyamedia
రాజకీయ వార్తలు

భారీ ప్యాకేజీని ప్రకటించిన మోదీ.. వివరాలు చెప్పనున్న నిర్మలా సీతారామన్!

Modi nirmalaseetharaman

ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి మంగళవారం చేసిన ప్రసంగంలో రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన  సంగతి తెలిసిందే. ప్యాకేజీని ప్రజలకు అందజేసే అంశాలపై పూర్తి వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. ప్రధాని ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వల్ల ప్రజలకు ఎలా లబ్ధి చేకూరనుందన్న విషయాలపై ప్రకటన చేయనున్నారు.

భారత్‌ అంతర్జాతీయంగా పోటీ పడేలా ఈ ప్యాకేజీ ఉంటుందని ఇప్పటికే కేంద్ర మంత్రులు తెలిపారు. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే పలు దేశాలు భారీ ప్యాకేజీలు ప్రకటించాయి. జపాన్‌ తమ జీడీపీలో 21 శాతం, అమెరికా 13 శాతం విలువైన ప్యాకేజీలను ప్రకటించాయి. ఆ తర్వాత భారత్ కూడా అది పెద్ద ప్యాకేజీని ప్రకటించింది.

Related posts