telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పెనాల్టీ లేకుండా బైక్‌లు విడుదల చేయాలి: దేవినేని ఉమ

uma devineni

లాక్‌డౌన్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్న బైక్‌లు రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీ‌స్‌ స్టేషన్లలో పడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందించారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటినుంచి స్వాధీనం చేసుకున్న బైక్‌లన్నీ పోలీస్‌ స్టేషన్‌లలోనే ఉండిపోవడంతో ఆ బైక్‌ల యజమానులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

వాహనాలను వాడకపోవడంతో పాడైపోతున్నాయని, కొన్ని తుప్పుపట్టిపోతున్నాయని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని దేవినేని ఉమ పోస్ట్ చేశారు.’బతుకుతెరువు కోసం రోడ్డెక్కిన భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు చిరు వ్యాపారులు సామాన్య మధ్యతరగతి వారి “బతుకుబళ్లు” సీజ్ చేశారు. స్టేషన్ల ముందు లక్షలాది వాహనాలు తుప్పుపట్టి పోతున్నాయి పెనాల్టీలు లేకుండా తక్షణం వాహనాలు విడుదల చేయమని ప్రజలు అడుగుతున్నారు. వెంటనే స్పందించండి జగన్ గారు’ అని దేవినేని పేర్కొన్నారు.

Related posts