telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : ఢిల్లీ దే విజయం

పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ఓపెనర్లు మయాంక్(69), రాహుల్(61) అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీని మొదటి నుండి విజయం వైపుకే అడుగులు వేసింది. ఈ మ్యాచ్ లో 92 పరుగులతో అద్భుతంగా రాణించి 8 పరుగుల దూరంలో తన సెంచరీ మిస్ చేసుకున్నాడు ధావన్. కానీ షమీ వేసిన 17 ఓవర్ లో 20 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ ఢిల్లీ వైపుకు మళ్లింది. ఇక ఆ తర్వాత కెప్టెన్ పంత్ ఔట్ అయిన తర్వాత స్టోయినిస్, లలిత్ యాదవ్ కలిసి జట్టుకు 6 వికెట్ల తేడాతో ఈ ఐపీఎల్ సీజన్ లో రెండో విజయాన్ని అందించారు.

Related posts