telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అలా జరిగితే బీజేపీ-వైసీపీ కుమ్మక్కైనట్లే: కేశినేని నాని

kesineni-nani

సంప్రదాయం ప్రకారం మండలి రద్దు బిల్లు స్టాండింగ్ కమిటీ పరిశీలించాలని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి రద్దుకు సంబంధించిన తీర్మానం నేరుగా పార్లమెంట్ లోకి వెళితే బీజేపీ-వైసీపీ ఈ విషయంలో కుమ్మక్కైనట్లేనని అన్నారు. ఇదే జరిగితే.. బీజేపీకి వైసీపీ బీ టీమ్ అని భావిస్తామని ఆయన చెప్పారు. 

ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ వద్ద 10 రాష్ట్రాలకు చెందిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు.కేంద్రం సంప్రదాయం ప్రకారం ఓ బిల్లు నేరుగా చట్ట సభలకు వెళ్లకపోవచ్చన్నారు. స్టాండింగ్ కమిటీ పరిశీలన తర్వాతే అది చట్ట సభల్లో ప్రవేశపెడతారన్నారు. ‘రాజధాని తరలింపు’ అంశం అంగుళం కూడా ముందుకు కదలలేదని కేశినేని వ్యాఖ్యానించారు.

Related posts