telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రణబ్‌ ముఖర్జీని కలిసిన మోదీ..

modi_pranab

నరేం‍ద్ర మోదీ ఈ నెల 30న రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ మంగళవారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలుసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు మోదీకి శుభాకాంక్షలు చెప్పిన ప్రణబ్, స్వయంగా మోదీకి ఆయనే స్వీట్ తినిపించారు. ఈ విషయాన్ని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా ప్రణబ్ పై ఆయన ప్రశంసలు కురిపించారు. ప్రణబ్ దాదాను కలవడం ప్రతిసారి ఓ మహోన్నత అనుభవాన్ని ఇస్తుందని కొనియాడారు.

ఈ దేశానికి ఎంతో సేవ చేసిన ప్రణబ్ గొప్ప రాజనీతిజ్ఞుడని, ఈరోజు ఆయన్ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్టు మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ నినాదమైన సబ్‌కా సాథ్‌..సబ్‌ కా వికాస్‌..సబ్‌కా విశ్వాస్‌ సాకారం కావాలని ప్రణబ్‌ ముఖర్జీ ఆకాంక్షించారు. ప్రణబ్‌తో భేటీ సందర్భంగా మాజీ రాష్ట్రపతిని రాజనీతిజ్ఞడిగా మోదీ కొనియాడారు. ప్రణబ్‌ దాదాతో ఎప్పుడు కలిసినా అది అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందని, అపార విజ్ఞానం సొంతమైన ఆయన అసలైన రాజనీతిజ్ఞుడని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

Related posts