ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మంగళవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కుమార్తె ఉషకు ఏపీ సీఎం జగన్ స్వయంగా ఫోన్ చేసి ఆమెను పరామర్శించారు. తెలుగు జాతి ఓ ప్రజా గాయకుడిని కోల్పోయిందని అన్నారు.
వంగపండు మృతిపై తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, ఉష ప్రస్తుతం ఏపీ క్రియేటివిటీ కల్చరల్ కమిషన్ చైర్ పర్సన్ గా విధులను నిర్వర్తిస్తున్నారు.
ఇచ్చిన వాగ్ధానాలకు బడ్జెట్కు పొంతన లేదు: టీడీపీ నేత అనురాధ