telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమరావతి : … బిల్లులు ముందుకు సాగని.. గందరగోళంలో మండలి..

ap sasana mandali no bill move forward

వికేంద్రీకరణ బిల్లులపై మండలిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. బిల్లు మండలిలో ప్రవేశపెట్టారని, రూల్‌ 71పై చర్చ తర్వాత వికేంద్రీకరణ బిల్లుపై దృష్టి సారిస్తారని లీకులు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని టీడీపీ వర్గాలు ఖండిస్తున్నాయి. వికేంద్రీకరణ బిల్లు మండలి ముందుకు రాలేదని, ప్రస్తుతం రూల్‌ 71పై మాత్రమే చర్చ జరుగుతోందంటున్నారు.

మండలి చైర్మన్‌తో మంత్రుల వరుస మంతనాల తర్వాత వికేంద్రీకరణ బిల్లుపై చర్చకి లైన్‌ క్లియర్‌ అయిందంటూ ప్రచారం జరిగింది. మండలి కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం లేకపోవడంతో ఊహాగానాలు ఆగడంలేదు.

Related posts