telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో 73 వేలు దాటిన కోవిడ్ కేసులు

Corona

తెలంగాణలో కరోనా విజృంభించడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. బుధవారం 2,092 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని, దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 73,050కు చేరుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న 13 మంది వైరస్ కారణంగా మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 589కి పెరిగిందని తెలిపింది. నిన్న మొత్తం 1,289 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, దీంతో ఇప్పటివరకూ డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 52,103కు చేరగా, మరో 20,358 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని పేర్కొంది.

బుధవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 21,346 మంది నమూనాలను పరీక్షించామని, ఇప్పటివరకూ 5.43 లక్షలకు పైగా నమూనాలను పరీక్షించామని తెలిపారు. నిన్న నిర్వహించిన టెస్టుల్లో 1,550 మంది ఫలితాలు వెల్లడికావాల్సి వుందని తెలియజేశారు. కొత్త కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 535 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 169 కేసులు, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 126, కరీంనగర్ జిల్లాలో 123, వరంగల్ పట్టణ పరిధిలో 128 కేసులు నమోదైనట్టు తెలిపింది.

Related posts