telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పర్చూరు బరిలో ఇద్దరు దగ్గుబాటి పేరున్న అభ్యర్థులు.. వైసీపీ ఆందోళన

Daggubati ysrcp candidate from parchur

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. సోమవారం నామినేషన్ల పర్వం ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి ఇంటి పేరు ఉన్న ఇద్దరు బరిలో నిలిచారు. వారి పార్టీ గుర్తులు కూడా దగ్గరగా ఉండటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. పర్చూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.

ఇదే క్రమంలో ఒంగోలు సమీపంలోని పెళ్లూరుకు చెందిన దగ్గుబాటి వెంకటేశ్వర్లు అనే మరో వ్యక్తి కూడా ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా పర్చూరు అసెంబ్లీకి నామినేషన్‌ వేశారు. పేర్లు దాదాపు ఒకేలా ఉండడం, పార్టీ ఎన్నికల గుర్తులు (ఫ్యాన్‌, హెలికాప్టర్‌) కూడా దగ్గరి పోలికలతో ఉండడంతో తమ ఓట్లు ఎక్కడ చీలుతాయోనని వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓట్లకు ఎసరు పెట్టేందుకు కుట్ర జరుగుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Related posts