తాజా టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆసీస్ సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఒక్క పాయింట్ తేడాతో తొలి స్థానాన్ని చేరుకోగా, భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో రెండో స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. 904 పాయింట్లతో స్మిత్ మొదటి స్థానంలో ఉండగా.. 903 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు కింగ్ కోహ్లీ. 2015 డిసెంబర్ నుంచి తొలి స్థానంలో ఉన్నాడు స్మిత్. అయితే 2018 ఆగస్టులో ఈ ఆటగాడు బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధం ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో కోహ్లీ కెరీర్లో బెస్ట్ ప్రదర్శనతో ర్యాంకింగ్స్తో తొలి స్థానం కైవసం చేసుకున్నాడు.
స్మిత్.. తొలి టెస్టులో రెండు శతకాలు సాధించాడు. రెండో టెస్టులో 92 పరుగులు చేశాడు. 63.2 శాతం సగటుతో సుదీర్ఘ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ఇక టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 7వ స్థానంలో నిలిచాడు.