telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రీడలు వార్తలు

ఏపీ లో బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్…

ఐపీఎల్ సీజన్ మొదలవగానే బెట్టింగ్ రాయుళ్లు తమ దందా మొదలు పెడతారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పోలీసులు బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకుని కేసులు కూడా నమోదు చేశారు. కాగా ఈ ఏడాది కరోనా విజృంభించడంతో హోటళ్లు, బిర్యానీ సెంటర్లలో కాకుండా ఇళ్లల్లోనే అడ్డా చేసుకుని బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. ఇక తాజాగా అలాంటి ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరులో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసారు పోలీసులు. ఈ బెట్టింగ్ కు పాల్పడుతున్న మొత్తం 15 మందిని అదుపులోకి తీసుకున్నారు చిత్తూరు పోలీసులు. పట్టుకున్న వారి వద్ద నుండి మొత్తం 2.65 లక్షల తుపాయాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే స్టూడెంట్స్ ఎక్కువగా బెట్టింగ్ లలో పార్టీసిపెట్ చేస్తున్నారని అన్నారు. డబ్బు ఎవ్వరికీ ఊరికే రాదు కష్టపడాలని, రాత్రికి రాత్రే శ్రీమంతుడు అవ్వాలనుకోవటం కరెక్ట్ కాదని బెట్టింగులకు నగర యువత దూరంగా ఉండాలని కోరుతున్నానమని అన్నారు.

Related posts