telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విదేశాల్లో చదివే విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త

కోవిడ్‌-19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో ఇవాళ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించాలని ఈ సందర్బంగా అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఉద్యోగాలకోసం వీసాలపై విదేశాలకు వెళ్లేవారికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే వారికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్టుగా ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్‌ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 92 మంది పిల్లలను గుర్తించిన ఏపీ సర్కార్ … వీరిలో 43 మందికి రూ.10 లక్షల చొప్పున డిపాజిట్‌ చేసింది. సరైన పథకాల్లో ఈ డబ్బు పొదుపు చేయడం ద్వారా భద్రత, నెలానెలా వారి మెయింటినెన్స్‌ కోసం మంచి వడ్డీ వచ్చేలా చూడాలన్న సీఎం జగన్ ఆదేశించారు.

Related posts