తైక్వాండో చాంపియన్షిప్ బాలుర టైటిల్ను హర్ష గిరీష్ కైవసం చేసుకున్నాడు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన అండర్-17 విభాగంలో 78 కేజీల విభాగంలో హర్ష గిరీష్కు స్వర్ణం లభించింది.
ఈ సందర్భంగా గిరీష్ మాట్లాడుతూ.. స్వర్ణపతకం గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయం కోసం చాలా కష్టపడ్డాను. ఈ టైటిల్ ను నా కోచ్, మా తల్లిదండ్రులకు అంకితమిస్తున్నానని గిరీష్ తెలిపాడు.