తెలంగాణ రాష్ట్ర నూతన విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే కార్యకర్తలు, నాయకులు పూల బొకేలతో కాకుండా, వాటికి బదులుగా నోట్పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని కోరిన విషయం తెలిసిందే. ఆ పిలుపుకు స్పందించిన అభిమానులు, కార్యకర్తలు 30వేలకు పైగా పుస్తకాలు, పెన్నులు, బాక్స్లు అందించారు. వీటిని త్వరలోనే పాఠశాలలకు వెళ్లి పేద విద్యార్థులకు అందజేయనున్నారు.
మొదటి పుస్తకాన్ని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేతుల మీదుగా మంత్రి స్వీకరించారు. తెలంగాణ చరిత్ర ప్రజలకు తెలిసేలా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చొరవ తీసుకోవాలన్నారు. గ్రంథాలయాల ప్రాముఖ్యత కాపాడడానికి దాతలు, రచయితలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పుస్తకాలు ఇవ్వాలన్న పిలుపునకు స్పందించిన వారందరి మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.