telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

తమ సర్వర్లు హ్యాకింగ్ కు గురయినట్లు గుర్తించిన సంగం డైరీ…

గుంటూరు సంగం సర్వర్లు హ్యాకింగ్ కు గురయినట్లు తెలిపింది. సర్వర్లు యాక్సిస్ పై ఇప్పటికే ఏసీబీ- సంగం మధ్య వివాదం జరుగుతుంది. ప్రైవేటు వ్యక్తులను సర్వర్ రూమ్ లోకి అనుమతిచడంపై గతంలోనే సంగం ఉద్యోగుల అభ్యంతరం తెలిపారు. ప్రైవేటు వ్యక్తులను నిలువరించిన రెండో రోజే హ్యాకింగ్ జరిగిందని… ఇది ప్రభుత్వం వెనుక ఉండి నడిపిస్తున్న కుట్ర అని యాజమాన్యం ఆరిపోస్తుంది.  సర్వర్లలో కీలక డేటా కోసం పోలీసుల వత్తిడి చేస్తున్నారు. హ్యాకింగ్ ను అడ్డుకోవడంతో ఏకంగా ఫోన్లు చేసి సంగం ఐటీ సిబ్బందిని బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు సర్వర్లను తరలించే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. అయితే సర్వర్ రూమ్ వద్దకు చేరుకున్న ఏసీబీ, పోలీసులకు సంగం ఉద్యోగులతో వాగ్వివాదం జరిగింది. కోర్ట్ ఆర్డర్స్ రాక ముందే సర్వర్లను తరలించే ప్రయత్నం చేస్తున్నారని యాజమాన్యం ఆరిపోస్తుంది. అయితే చూడాలి మరి ఇంకా ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది.

Related posts