ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు చేపట్టిన అమరావతి యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వెంకటపాలెంలో చంద్రబాబు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. చంద్రబాబు కాన్వాయ్ రాగానే ఓ వర్గం వారు ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై చెప్పులు, కర్రలతో దాడి చేశారు.
ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలతో హోరెత్తించారు. బాబు కాన్వాయ్ వైపు దూసుకెళ్లేందుకు ఓ వర్గం రైతులు విఫలయత్నం చేయడంతో, పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టి చంద్రబాబు కాన్వాయ్ కి దారి కల్పించారు. బాబు పర్యటన ఓ వైపు స్వాగతం, మరోవైపు నిరసనల మధ్య సాగుతోంది.
చంద్రబాబుకు అభివృద్ధి గురించి ఏం తెలుసు: మంత్రి బొత్స