నిధి అగర్వాల్ మళ్ళీ బాలీవుడ్లో మూడు సంవత్సరాల తరువాత అడుగు పెట్టనుంది. ఆమె చివరగా 2017లో టైగర్ ష్రాష్ సరసన మున్నా మైఖెల్ సినిమాతో బాలీవుడ్ను పరిచయం అయింది. ఆమె హైదరాబాద్ అమ్మాయని తెలియడంతో టాలీవుడ్ వారు ఆమెకు అవకాశాలు ఇచ్చారు. మిస్టర్ మజ్ను సినిమా చేసినా అంతగా ఆకట్టుకోలేకపోయింది. తరువాత ఒక్క హిట్ అంటూ హిట్ కోసం ఎదురు చూస్తున్న నిధికి మరో అవకాశం వచ్చింది. ఈ సారి వచ్చింది చిన్న హీరోతో కాదు. ఎనర్టటిక్ హీరో రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ అంటూ స్టెప్పులు వేసింది. అప్పటికి ఆఫర్లు ఆమె వైపుకూడా చూడలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ తంబీలు భూమి, శింబుతో ఈశ్వరుడు సినిమాల్లో చేస్తోంది. తెలుగులో మాత్రం కొత్త హీరో అశోక్ గల్లా సినిమాలో నటిస్తోంది. ఇక మళ్లీ పెద్ద ఆఫర్ల కోసం ఎదురుచూపులు చూస్తున్న నిధికి బాలీవుడ్ మళ్లీ దారి చూపింది. బాలీవుడ్లో కొత్తగా ఓ ఆఫర్ రావడంతో తెలుగు, తమిల చిత్రాలు పూర్తయిన వెంటనే బాలీవుడ్ పట్టాలు ఎక్కేందుకు రెడీ అవుతుందీ ముద్దుగుమ్మ. చూడాలి మరి ఈ సినిమా అమ్మడికి కలిసొస్తుందా… లేదా అనేది.
previous post
అందుకే కాంగ్రెస్ ను వీడుతున్నాను: ఎమ్మెల్యే లింగయ్య