బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శనివారం గాంధీనగర్ లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. తన భార్య, కుమారుడితో కలిసి ఆయననామినేషన్ వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… దేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయం లేదన్నారు. ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. అంతకముందు భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి అమిత్ షా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రకాశ్ సింగ్ బాదల్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు పలువురు బీజేపీ అగ్రనాయకులు పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నేత అద్వానీ స్థానంలో ఈసారి అమిత్ షా పోటీ చేస్తున్నారు. గతంలో గాంధీనగర్ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు అద్వానీ పోటీ చేశారు.