telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కుప్పంలో ఫలితాలు ఆశ్చర్యంగా లేవు…

Ycp Kannababu

ఏపీలో ప్రస్తుతం పంచైతే ఎన్నికల హావ నడుస్తుంది. అయితే ఇందులో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ మద్దతు దారుల హవా కొనసాగుతుండడంతో.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు చేసుకుంటున్నాయి వైసీపీ శ్రేణులు.. మంత్రులు కన్నబాబు, బొత్స, వెల్లంపల్లి, ఇతర నేతలు పాల్గొన్నారు.. ఈసారి ఫలితాల్లో పుంగనూరు, కుప్పం ఫలితాలు ప్రత్యేకం అంటున్నాయి వైసీపీ శ్రేణులు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి కన్నబాబు.. కుప్పంలో ఫలితాలు ఆశ్చర్యంగా లేవు.. కుప్పంలో చంద్రబాబు కోట కూలుతుందని ఊహించిందేనన్నారు.. కుప్పం అయినా… ఇచ్ఛాపురం అయినా ఇవే ఫలితాలు ఉంటాయని ధీమా వ్యక్తం చేసిన కన్నబాబు.. టీడీపీ అంతర్జాతీయ పార్టీ… ఆంధ్రప్రదేశ్ లో కాకపోయినా… అండమాన్ అండ్ నీకోబార్ అయినా నిలబడే ఉంటుంది.. చంద్రబాబుకు ఇబ్బంది ఏమీ లేదు అంటూ ఎద్దేవా చేశారు. కుప్పంలో కూడా బలవంతపు ఏకగ్రీవాలు చేశామని ఆరోపిస్తున్నారంటే… అతను అంత బలహీన నాయకుడో అర్థం చేసుకోవచ్చు అని మండిపడ్డారు మంత్రి కన్నబాబు. చూడాలి మరి దీని పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారు అనేది.

Related posts