telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేటీఆర్ ను సీఎం చేస్తే కేబినెట్ ఖాళీ: బీజేపీ ఎంపీ సంజయ్

bandi samjay mp

కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే కేబినెట్ తో పాటు టీఆర్ఎస్ పార్టీ కూడా ఖాళీ అవుతుందని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ను సీఎం చేయాలన్న తపన కేసీఆర్ లో బాగా కనపడుతోందని విమర్శించారు. అందుకే తాను ప్రధాన మంత్రిని అవుతానంటూ సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను టీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తోందో స్పష్టం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

సీఏఏను ముస్లింలు వ్యతిరేకించడం లేదని, ఈ అంశాన్ని కేవలం రాజకీయ కోణంలో చూస్తున్న ప్రతిపక్ష పార్టీలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. నాడు ‘గోకుల్ చాట్’ లో బాంబులు పేల్చి అనేక అమాయకులు ప్రాణాలు బలిగొన్న పాకిస్థాన్ టెర్రరిస్టులకు మన దేశంలో పౌరసత్వం ఇద్దామా? లుంబినీ పార్క్ లో బాంబులు పేల్చి అమాయకులను బలిగొన్నటువంటి వ్యక్తులకు మన దేశ పౌరసత్వం ఇద్దామా? అని ఆయన మండిపడ్డారు.

Related posts