హీరోయిన్ సమంత భర్త నాగచైతన్యతో విడాకులపై ఎట్టకేలకు స్పందించింది. దీనిపై సమంత ఇన్స్టాలో భావోద్వేగ పోస్ట్ పెట్టింది. తనను ఒంటరిగా వదిలేయండని ఆవేదన వ్యక్తం చేసింది.. సమంత నాగచైతన్యల జంట మీడియా ముఖంగా విడిపోతున్నామని ప్రకటించినప్పటి నుండి ఎన్నెన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు. విడాకులకు కారణం ఏంటి, ఎవరి కారణంగా విడాకులయ్యాయి, ఎవరిదీ తప్పు, ఎవరిదీ ఒప్పు ఇలా పలురకాల విశ్లేషణలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా సామ్ పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని.. ఇప్పటికే రెండు సార్లు అబార్షన్ చేయించుకుందని.. పిల్లల్ని కంటే కెరీర్కు అడ్డుగా మారుతుందని భావించిందని.. ఈ విషయం చైతన్యకు నచ్చకనే ఇద్దరు విడిపోయారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. పిల్లల విషయంలో నాగ్ కుటుంబం సమంతకు ఎంతో నచ్చచెప్పిందని.. కానీ ఆమె వినలేదనే వార్తలు కూడా వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో చైతూతో డివోర్స్పై ట్విట్టర్లో వివరణ ఇచ్చింది సమంత. నా వ్యక్తిగత సమస్య మీద మీరందరూ చూపిన ఎమోషన్స్కి , జాలి, దయకు కృతజ్ఞతలు. అనవసర వదంతులతో తనను చాలా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. జాలి లేకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని బాధపడుతూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది.
“విడాకులు తర్వాత తనపై ఎన్నో వదంతులు వచ్చాయి. నాకు సంబంధాలు అంటగట్టారు. నేను పిల్లలు వద్దనుకుంటున్నానని ప్రచారం చేశారు. అవకాశవాదినని నన్ను విమర్శించారు. విడాకులు తీసుకోవడం ఎంతో బాధతో కూడిన ప్రక్రియ. నన్ను ఒంటరిగా వదిలేయండి. జాలి లేకుండా వ్యక్తిగత విమర్శల దాడి చేస్తున్నారు. కానీ.. మీరనుకునే విధంగా నేనెప్పుడూ చేయను.
ఇది నా ప్రామిస్.. ఈ కుంగుబాటు నుంచి కోలుకునేందుకు కొంత టైమ్ ఇవ్వండి..అయితే ఒక్క విషయం చెప్పదల్చుకున్నాను.. ఈ తప్పుడు ప్రచారం నన్ను ఏమాత్రం కుంగదీయలేదు అంట ఆవేదనతో కూడిన లెటర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
— Samantha (@Samanthaprabhu2) October 8, 2021
ఈ నెల 2వ తేదీన తాము విడిపోవటంపై సమంత నాగచైతన్య ఏకకాలంలో సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. “మా శ్రేయోభిలాషులందరికీ.. ఇక నుంచి మేం భార్య-భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి వేర్వేరుగా మా సొంత మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్నాం. పదేళ్లుగా మా స్నేహం కొనసాగినందుకు మేం అదృష్టవంతులం. మా స్నేహం వివాహ బంధానికి చాలా కీలకంగా నిలిచింది. ఇప్పుడు ఈ కష్ట సమయంలో అభిమానుల మద్దతు కావాలి. మా గోప్యతను కాపాడాలని శ్రేయోభిలాషులు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం” అని ఇరువురూ పోస్ట్ చేశారు.