నాని హీరోగా నటించిన టక్ జగదీష్ మూవీ రిలీజ్ వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతల అసోసియేషన్ చేసిన ఈ ప్రకటన ఆ చిత్ర యూనిట్కి మద్ధతుగా నిలిచినట్టయింది.
‘‘నటీనటులు సాంకేతిక నిపుణులతో కలిసి ఓ సినిమాకు పునాది వేసి, ఆ సినిమాను నిర్మించే నిర్మాతకు తన సినిమాను ఎప్పుడు.. ఎక్కడ విడుదల చేయాలనే తీసుకునే విషయంలో ఆ చిత్ర నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ, అధికారాలు ఉంటాయని నిర్మాతల సంఘం ఓ ప్రెస్నోట్ను విడుదల చేశారు.
టగ్ జగదీష్ సినిమా విడుదల విషయంలో నానికి, ఎగ్జిబిటర్స్ కి మధ్య విభేధాలు తలెత్తడం, ఆ తర్వాత వాళ్లు కొంత వెనక్కి తగ్గడం జరిగింది. కరోనా తర్వాత థియేటర్లు మూతపడటం, ఒకవేళ తెరిచినా థియేటర్లలో సినిమాలకు గతంలో మాదిరిగా ఆదరణ లేకపోవడంతో టక్ జగదీష్ సినిమాను థియేటర్లలో కాకుండా ఓటిటి ప్లాట్ ఫామ్స్పైనే విడుదల చేయాలని నిర్మాతలు డిసైడ్ కాగా.. నిర్మాతల నిర్ణయాన్ని ఎగ్జిబిటర్స్ తీవ్రంగా వ్యతిరేకించడమే ఈ వివాదానికి కారణమైంది.
.
అయితే, ఈ వివాదంపై స్పందించిన టాలీవుడ్ చిత్ర నిర్మాతల మండలి.. ఏ చిత్రానికైనా వెన్నెముకగా నిలిచే నిర్మాత సంక్షేమమే తమ తొలి ధ్యేయం అని ప్రకటించింది. ఆ సమావేశంలో ఓటీటీలో తమ సినిమాను విడుదల చేయాలనుకున్న హీరో, నిర్మాతను సభాముఖంగా విమర్శించడం, వ్యక్తిగతంగా బెదిరించడం అమోదయోగ్యం కాదని ఏటీఎఫ్పీజీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మార్కెట్ ఉన్న హీరోల వల్లే ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతోందని, ప్రత్యేకంగా ఒక హీరోని టార్గెట్ చేయడం అనేది ఇండస్ట్రీలోని స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీస్తుందని కూడా ఏటీఎఫ్పీజీ పేర్కొంది.
నాని హీరోగా నటించిన టక్ జగదీష్ మూవీ రిలీజ్ వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతల అసోసియేషన్ చేసిన ఈ ప్రకటన ఆ చిత్ర యూనిట్కి మద్ధతుగా నిలిచినట్టయింది.