telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో కొత్త కథకు బుట్టబొమ్మ ఒకే..!

పూజా హిగ్దే ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తోంది. ఒకటి పాన్ ఇండియా స్థాయి సినిమా రాధే శ్యామ్, దీంతో పాటు యువ హీరో అఖిల్‌తో పాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తోంది. వీటిలో రాధే శ్యామ్ పీరియాడిక్ ప్రేమకథగా రూపొందుతోంది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు మరో లవ్‌స్టోరీ చేసేందుకు ఆఫర్ వచ్చింది. దుల్కర్ సల్మాన్ హీరో పాత్రలో రాఘపుడి దర్శకత్వంలో మరో పీరియాడిక్ లవ్ స్టోరీ చేయనున్నారు. ఈ సినిమా పేరు ఇంకా ఫైనల్ కాలేదు. కానీ ఈ సినిమాను ఓ యుద్ద సైనినకుడి కోణంలో చిత్రీకరించనున్నట్లు సమాచారం. దాంతో ఈ సినిమాకి యుద్దంతో రాసిన ప్రేమకథ అనే కాప్షన్‌ను పెట్టారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు కావాల్సి ఉంది. వారిలో మెయిన్ హీరోయిన్‌గా పూజా హిగ్దేను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు పూజా దాదాపు రూ.2.5కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందట. నిర్మాత స్వప్నాదత్ అంత ఇవ్వలేమని కాస్త తగ్గించుకోమని అడిగారట. అయితే రెండో హీరోయిన్‌గా లక్కీ బ్యూటీ రష్మికను అడిగాలని ఆలోచిస్తున్నారు. అయితే రష్మిక అంగీకరించడం కష్టమే అంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది జనవరీలో ప్రారంభం కానుంది.

Related posts