దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కరోనా వైరస్ ఇంత వరకు అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30 వరకు జనాలు గుమికూడటంపై ఆంక్షలు కొనసాగుతాయని ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ ర్యాలీలు, ఫంక్షన్లపై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారు మృత్యుంజయ కుమార్ స్పందిస్తూ, జూన్ 30 వరకు ప్రజలు గుమికూడకుండా కఠిన చర్యలను తీసుకోవాలంటూ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. కరోనాను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రంజాన్ ప్రార్థనల సందర్భంగా ముస్లింలు గుమికూడటంపై కూడా నిషేధాన్ని విధించారు.యూపీలో ఇప్పటి వరకు 1,600కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 25 మంది ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు.
కేంద్రం హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: సుజనా చౌదరి