telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వరద బాధితులకు రూ.2 వేల చొప్పున సాయం: జగన్

cm jagan

రాష్ట్రంలో వరద పరిస్థితులపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంల నుంచి ఏపీ సీఎం జగన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. వరద బాధిత కుటుంబాలకు రూ.2 వేల చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నట్టు ప్రకటించారు.

మరో మూడ్రోజుల్లో గోదావరి శాంతించే అవకాశం ఉందని అన్నారు. విద్యుత్, సమాచార సేవలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పది రోజుల్లో పంట నష్టం అంచనా వేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Related posts