దేశవ్యాప్తంగా రెండో విడత లోక్సభ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 95 స్థానాల్లో నేడు పోలింగ్ జరగనుంది. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 11 రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. పలువురు రాజకీయ ప్రముఖులు రెండో దఫా ఓటింగ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ క్రమంలో తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో పెళ్లి నుంచి నేరుగా ఓ కొత్త జంట ఓటు వేయడానికి పోలింగ్ బూత్కు రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వివరాల్లోకి వెళితే జమ్ము కశ్మీర్లోని ఉదంపుర్ పోలింగ్ బూత్కు పెళ్లి దుస్తుల్లోనే వచ్చిన ఈ జంటకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలో వైరల్ అవుతోంది. కొత్తజంటకు వివాహ శుభాకాంక్షలు చెబుతూ, ఓటు హక్కును తప్పకుండా ప్రతిఒక్కరు వినియోగించుకునేలా ఈ జంట అందరికీ స్పూర్తినిస్తుందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఏడు నెలల్లోనే రూ.35 వేల కోట్ల అప్పులు: యనమల