telugu navyamedia
రాజకీయ

పెళ్లి దుస్తుల్లో పోలింగ్‌ బూత్‌కు..  ఓటేయడానికి వచ్చిన  కొత్త జంట!

Newly married couple cast vote
దేశవ్యాప్తంగా రెండో విడత లోక్‌సభ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 95 స్థానాల్లో నేడు పోలింగ్‌ జరగనుంది. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 11 రాష్ట్రాల్లో పోలింగ్‌ జరగనుంది. పలువురు రాజకీయ ప్రముఖులు రెండో దఫా ఓటింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ  క్రమంలో  తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో పెళ్లి నుంచి నేరుగా ఓ కొత్త జంట ఓటు వేయడానికి పోలింగ్‌ బూత్‌కు రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 
వివరాల్లోకి  వెళితే జమ్ము కశ్మీర్‌లోని ఉదంపుర్‌ పోలింగ్‌ బూత్‌కు పెళ్లి దుస్తుల్లోనే వచ్చిన ఈ జంటకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలో వైరల్‌ అవుతోంది. కొత్తజంటకు వివాహ శుభాకాంక్షలు చెబుతూ, ఓటు హక్కును తప్పకుండా ప్రతిఒక్కరు వినియోగించుకునేలా ఈ జంట అందరికీ స్పూర్తినిస్తుందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related posts