గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబుతో ఫొటో దిగేందుకు కార్యకర్తలు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా తమ కార్యకర్తలకు చంద్రబాబు ఓ సూచన చేశారు. కాళ్లకు నమస్కారాలు చేయొద్దు, ఫొటోలు మాత్రం తీసుకోండని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కార్యకర్తలకు సూచించారు. టీడీపీకి నష్టం చేయాలని ఎవరైనా అనుకుంటే వారికే నష్టం తప్ప తమకేమీ కాదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.
తెలుగుదేశం పార్టీని బలపరిచే ఒక సైన్యాన్ని తయారు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉండవల్లిలో చంద్రబాబు తన నివాసం ఖాళీ చేస్తారన్న అంశం గురించి కార్యకర్తలు ప్రస్తావించారు. “మేమున్నాం మీరు కనపడే దేవుడు “అంటూ కార్యకర్తలు నినదించారు.ఇందుకు చంద్రబాబు స్పందిస్తూ, మీరే నాకు శ్రీరామరక్.. మీ ఇల్లే నా ఇల్లు అని వ్యాఖ్యానించారు.