గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించనున్న బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ఈరోజు మధ్నాహ్నం మూడు గంటలకు నారాకోడూరు మీదుగా బయలుదేరిన చంద్రబాబు ర్యాలీ తెనాలిలోకి ప్రవేశించింది. చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
చంద్రబాబు వెంట అఖిలపక్ష జేఏసీ నేతలు ఉన్నారు. స్థానిక వీఎస్ ఆర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్న సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ సభలో జేఏసీ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.