నల్లగొండ జిల్లాలో విషాదం నెలకొంది. కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని పీఏపల్లి మండలం దుగ్యాల వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు కూతురు ప్రాణాలు కోల్పోయారు. కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వేగంగా వెళ్తున్న కారు ముందు టైరు పేలడంతో.. రోడ్డు పక్కనే ఉన్న ఏఎంఆర్పీ లింక్ కెనాల్లోకి దూసుకెళ్లింది.
దీంతో కారులో ప్రయాణిస్తున్న దంపతులు ఓర్సు రఘు, అలివేలు, కుమార్తె కీర్తి మృతి చెందారు. స్థానికులు, పోలీసులు కలిసి కుమారుడిని ప్రాణాలతో కాపాడారు. క్రేన్ సాయంతో కాల్వలోకి దూసుకెళ్లిన కారును బయటకు తీశారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులను పీఏపల్లి మండలం వడ్డెరిగూడెం వాసులుగా పోలీసులు గుర్తించారు.