telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆరెస్ వచ్చే రెండేళ్లు కొనసాగడం కష్టమే : బండి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో టీఆర్ఎస్‌ పాలన పూర్తిస్థాయిలో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదని.. ఎప్పుడు ప్రభుత్వం పడి పోతుందో తెలియదు.. వచ్చే రెండేళ్లు కొనసాగడం కూడా కష్టమే నంటూ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.. మరోవైపు.. మంత్రి పువ్వాడను టార్గెట్ చేవారు బంఇ.. మంత్రి చరిత్ర ఏంటో తెలుసుకోవాలన్న ఆయన.. ఖమ్మం కార్పొరేషన్ లో కాషాయ జెండా ఎగరవేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.. బీజేపీని విమర్శిండానికి మంత్రికి సిగ్గుండాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన.. మంత్రికి ఒక్క రోడ్డు యాక్షన్ చేపించుకునే దమ్ముందా..? అంటూ ప్రశ్నించారు. నాలుగేళ్లలో నాలుగు పార్టీలు మారారు.. ఈ మంత్రి నీతులు మాకు చెప్పుతారా..? అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. నీ చరిత్ర ఏంటో ఖమ్మం ప్రజలకు తెలుసు.. అక్రమ భూములని రెగ్యులర్ చేసుకోవడం కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరారని ఆరోపించారు. మెడికల్ కాలేజీ పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్నారని విమర్శించిన బండి.. బీజేపీ అధికారంలోకి రాగానే మంత్రి అక్రమాలన్ని బయట పెడుతామని ప్రకటించారు. ఇక, దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ పై కరోనా వ్యాక్సిన్ ప్రయోగించాం.. రెండు చోట్ల సక్సెస్ అయ్యిందన్నారు బండి సంజయ్.. తర్వాత ఖమ్మం కార్పొరేషన్ లో వ్యాక్సిన్ ప్రయోగించ బోతున్నాం అని పేర్కొన్నారు.

Related posts