సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం జరుగనుంది. ప్రగతిభవన్ వేదికగా సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కీలక సమావేశంలో అనేక అంశాలు చర్చకు రానున్నాయి. ప్రధానంగా నూతన రెవెన్యూచట్టంపై రేపటి సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
నూతన చట్టానికి సంబంధించి రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే పలు దఫాలు సమావేశమై సూచనలు సలహాలు తీసుకున్నారు. కొత్త సచివాలయం నిర్మాణంపై సమావేశంలో చర్చించి శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేయనున్నారు. హుజూర్ నగర్ అసెంబ్లీ ఉపఎన్నిక అంశం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది.