telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మేడారం జాతరకు అమరావతి రైతులు

medaram jatara

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని 53 రోజుల నుంచి ఆ ప్రాంత రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొందరు బయట పార్టీలు, నాయకులు, సంస్థల మద్దతు కోరుతూ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి జేఏసీ నేతలు ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో ధర్నా అనంతరం మేడారం జాతరకు బయలు దేరారు.

అమరావతిని రాజధానిగా కొనసాగేలా చూడాలని కోరుతూ వనదేవతలకు మొక్కులు సమర్పించారు. సమ్మక్క, సారలమ్మలకు ముందస్తు మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక బస్సులో బయలుదేరిన వీరు జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్‌ అంటూ నినాదాలు చేశారు.

Related posts