హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అనంతరం మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పార్థీవ దేహన్ని సోమవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్టు భవనానికి తరలించారు. ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో కోడెల భౌతిక కాయం వద్ద పలువురు పార్టీ నేతలు ఆయనకు నివాళులర్పించారు.
ఎన్టీఆర్ ట్రస్టు భవనం నుండి కోడెల భైతిక కాయాన్ని రాత్రి 8 గంటలకు ఆయన ఇంటికి తీసుకెళ్లనున్నారు. మంగళవారం ఉదయం కోడెల శివప్రసాదరావు బౌతికకాయంతో చంద్రబాబు నాయుడు గుంటూరుకు చేరుకొంటారు. రేపు సాయంత్రం నర్సరావుపేటలో కోడెల అంత్యక్రియలు నిర్వహించనున్నారు.