భూటాన్లో ఈ రోజు భారత ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు. ప్రమాదంలో మృతిచెందిన వారిలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ పైలట్ ఉన్నారు. భూటాన్ ఆర్మీకి చెందిన శిక్షణ పైలట్ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
అరుణాచల్లోని కిర్మూ నుంచి భూటాన్లో యాంగ్ఫుల్లా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. భూటాన్లోని యోన్పుల్లాలో ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి ముందు హెలికాప్టర్తో రేడియో, విజువల్ కంట్రోల్ తప్పిపోయింది. ఈ ఘటన అనంతరం హెలికాప్టర్ శిథిలాలను అధికారులు గుర్తించారు.