telugu navyamedia
రాజకీయ వార్తలు

మన తీరప్రాంతంపై దాడికి ప్రయత్నించే అవకాశం: రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh inaugurates NIA office

పొరుగుదేశానికి చెందిన తీవ్రవాదులు దాడికి ప్రయత్నించే అవకాశం ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. తీవ్రవాదులు మన తీరప్రాంతంపై దాడికి పాల్పడే అవకాశాలను కొట్టిపారేయలేమని తెలిపారు. కచ్ నుంచి కేరళ వరకు పశ్చిమతీరం విస్తరించి ఉందన్నారు.

తీరం వెంబడి ఏదో ఒక చోట దాడికి యత్నించే అవకాశముందని పేర్కొన్నారు. అయితే, భారత సముద్ర భద్రత వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉందని, తీరప్రాంత వాసుల రక్షణకు భద్రత బలగాలు భరోసానిస్తున్నాయని తెలిపారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు రక్షణ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని ట్విటర్ లో రాజ్ నాథ్ స్పష్టం చేశారు.

Related posts