telugu navyamedia
రాజకీయ వార్తలు

ఉప ఎన్నికల్లో గెలుపొందిన వారికి మంత్రి పదవులు: యడియూరప్ప

Yadyurappa

కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 15 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించగా 12 స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. తమ పార్టీ ఘన విజయంపై ముఖ్యమంత్రి యడియూరప్ప సంతోషం వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో 11 మందికి మంత్రి పదవులు ఇస్తామని తెలిపారు. ఇదే విషయంపై హైకమాండ్ తో మాట్లాడేందుకు రెండు, మూడు రోజుల్లో ఢిల్లీకి వెళతానని చెప్పారు.

కర్ణాటకలో అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆరు స్థానాల్లో విజయం సాధించాల్సిన తరుణంలో 12 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా… కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. జేడీఎస్ ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.

Related posts