telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : రాణించిన రాజస్థాన్ బౌలర్లు…

ముంబై వేదికగా కోల్‌కత నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కు చుక్కలు చూపించారు రాయల్స్ బౌలర్లు. మొదటి నుండు కట్టుదిట్టమైన బంతులు వేసి వారిని పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. కానీ రాహుల్ త్రిపాఠి(36), దినేష్ కార్తీక్ (25) రాయల్స్ బౌలర్లు తట్టుకొని నిలబడి స్కోర్ బోర్డును నడిపించారు. అయిన చివర్లో రాయల్స్ బౌలర్లు మళ్ళీ పుంజుకోవడంతో కోల్‌కత నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది నైట్ రైడర్స్. ఇక రాయల్స్ బౌలర్లలో క్రిస్ మోరిస్ 4 వికెట్లు తీయగా జయదేవ్ ఉనద్కట్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే రాయల్స్ 134 పరుగులు చేయాలి. అయితే రాజస్థాన్ జట్టులో హిట్టర్లు ఉండటంతో వారికీ ఇది చిన్న లక్ష్యమే… కానీ వారి ఏం చేస్తారు.. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి మరి.

Related posts