telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

సెంట్రల్ మాలి లో .. సైనిక స్థావరాలపై ఉగ్రదాడి.. 21 మంది మృతి..

terrorist attack in central mali 21 soldiers dieda

ప్రపంచంలో తమ ఉనికిని చాటుకుంటున్నారు ఉగ్రవాదులు. మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 21 మంది సైనికుల ప్రాణాలను బలితీసుకున్నారు. సెంట్రల్ మాలిలోని సైనిక స్థావరంపై ఆదివారం జరిగిన ఈ దాడితో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లలో వచ్చిన దుండగులు దియౌరాలోని సైనిక స్థావరంపై కాల్పులకు తెగబడ్డారు.

terrorist attack in central mali 21 soldiers diedaఈ కాల్పుల్లో 21 మంది సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు సైనిక వర్గాలు తెలిపాయి. ఉగ్రదాడిపై స్పందించిన అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకార్ కిటా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

Related posts