వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏడు నెలల్లోనే రూ.35 వేల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఆర్టికల్ 360 కింద రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏపీలో ఆదాయం పడిపోవడమే కాకుండా రెవెన్యూ వ్యయం పెరిగిందని యనమల రామకృష్ణుడు తెలిపారు. రాష్ట్రంలో మూల ధన వ్యయం రూ.10,486 కోట్లు తగ్గిందని ఆయన చెప్పారు. వచ్చే ఆదాయం అంతా జీతాలు, పింఛన్లకే సరిపోతుందని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు.
పోలవరంలో తగ్గించి ఎలక్ట్రిక్ బస్సుల్లో పెంచారు: లోకేశ్