ఏపీఎస్ ఆర్టీసీలో కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో 8 సంఘాలు ఏకమై సమ్మెబాట పట్టనున్నాయి. రేపు కార్మిక సంఘాల జేఏసీ కీలక సమావేశం అవుతుండగా ఆ సమావేశంలో సమ్మె తేదీ నిర్ణయించనున్నారు. యాభై శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సంఘాలు డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదని ప్రకటించింది.
దీంతో కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టనున్నాయి. అధికారుల సంఘం(ఓస్వా) కూడా కార్మికులకు మద్దతు పలకడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఆర్టీసీలో పెద్ద యూనియనైన ఎన్ఎంయూతో గుర్తింపు సంఘం సంప్రదింపులు జరుపుతోంది. గతంలో రెండు సంఘాలూ ఏకమై 43% ఫిట్మెంట్ సాధించుకున్నాయి. అదే అనుభవంతో ఇప్పుడు మరోసారి ఐక్యంగా సమ్మెబాట పట్టాలని యూనియన్ నేతలు సమ్మె చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కారణంగానే వరదలు: దేవినేని ఫైర్